Halloween Costume ideas 2015

Can you see God

మనుష్యులు తండ్రి అయిన దేవున్ని చూడగలరా?

నేటి క్రైస్తవ సమాజములో వినబడుతున్న ఒక భయంకరమైన ,bibleకు విభిన్నమైన మాట దేవుడు మాకు కనిపించాడని, చూసామని. మానవుని నేత్రాలు దేవునిని చూసే శక్తిగలవా?
వాక్యము చెప్పేవారి చేతులోని దేవుని వాక్యము(bible) ఇచ్చాడు మరియు వాక్యము వింటున్నవారి చేతులోని దేవుని వాక్యము(bible) ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితులలో వాక్యము విషయములో మోసము జరగకూడదు,వాక్యము విషయములో ఎవరు మోసపోకుడదు.కానీ ఈ రోజు దేవుని వాక్యము అందరి చేతిలో ఉన్న వాక్యము విషయములో అందరు మోసపోతున్నారు.కారణము వినే వారికీ వాక్యము పట్ల సరియైన శ్రద్ద లేకపోవటము,ఆలోచన లేకపోవటము వల్లనే.వాక్యము చెప్పేవారు bibleలో లేనివి,భిన్నమైనవి ఎన్నో చెబుతున్నారు and ఇవన్ని విని christians నమ్మి మోసపోతున్నారు.మనము ఈ విషయములో అయిన మోసపోతే పరవాలేదు కానీ వాక్యము విషయములో మోసపోకుడదు. ఆస్తిలో,ధనములో,job పోతే మళ్ళిసంపాదించుకోవచ్చు కానీ వాక్యము విషయములో మోసపోతే ఆ తర్వాత సరిచేసుకునే అవకాశము లేక ఆ తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్లి కలకాలము ఏడ్పుతో ,పళ్ళు కొరుకుతు భయంకరమైన భాద అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.కనుక వాక్యము విషయములో జాగ్రతగా ఉండాలి.

1)వాక్యము చెప్పే వక్తిని చూడక వాక్యము చెప్పే వాడిని చుడండి అని యేసు అంటున్నాడు. మార్క్ 4:24: మీరు ఏమి వినుచున్నారో జాగ్రతగా చుచుకోనుడి. ఎవరు చెబుతున్నారో కాక వాక్యము ఏమి చెబుతున్నది అన్నదానిపై శ్రద్ద పెట్టండి అని అర్థము.వినబడుతున్నదంతా నిజాము కాదు గనుక యేసు ఈ మాట అనవలసివచ్చింది. వినబడేదంతా వాస్తవము కాదు.నేటి క్రైస్తవ సమాజములో వినబడే వాక్యము అంత నిజము కాదని గ్రహించాలి.అందుకే దేవుడు మన చేతికి వాక్యమును ఇచ్చాడు.వాక్యము మన చేతిలో ఉన్న మోసపోతే మనకన్నా దురదృష్టవంతులు ఈ లోకములో ఎవరు ఉండరు. 2) ఈ రోజు క్రైస్తవ్యములో కొన్ని సంఘాలలో ప్రత్యేకించి “దేవునిని చూడడానికి ఉపవాసము ఉండాలని,అల ఉపవాసము తో మోకాళ్ళు వేసి కన్నీళ్ళుతో దేవునికి prayer చేస్తే ఆ దేవుడు మన కళ్ళ యెదుట వస్తాడని,కనిపిస్తాడని లేని పోనీ మాయ మాటలు చెప్పి అమాయకులైన విస్వాసుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వారును లేకపోలేదు. 3) ముందుగా దేవుడు ఏంటో,ఎలా ఉంటాడో అన్న విషయము తెలిస్తే ఇలాంటి మాటలు ఎవ్వరు మాటలాడరు.వీరికి దేవుడు ఎవరో,ఎలా ఉంటాడో అని అవగాహనా లేక దేవునిని మేము చూసామని,కనపడ్డాడు అని చెప్పుతున్నారు. ఇంతకు దేవుడు ఎలా ఉంటాడని bibleలో చూస్తే john 4:24-దేవుడు ఆత్మ గనుక...... ఇక్కడ దేవుడు ఆత్మ అని యేసు అంటున్నాడు. అస్సలు ఈ ఆత్మను చూడగలమా??? ఆత్మయైన దేవునిని పక్కన పెట్టి మనలో ఉన్న ఆత్మను ఆలోచిస్తే మనలో ఉన్న ఆత్మను చుడగలుగుతున్నమా? nithinలో ఉన్న ఆత్మను మీరు చూడలేరు and మీలో ఉన్న ఆత్మను నేను చూడలేను.ఎదురు ఎదురుగా ఉన్న మనము ఒకరి ఆత్మ ఒకరు చూడలేని పరిస్థితి ఉంటె పరలోకమందున్న దేవునిని చూసాము అంటే ఎలా నమ్ముతాము??? roma 1:20-అయన అదృశ్య లక్షణాలు.....paul తన పత్రికలలో అదృశ్యుడు అని అంటే వీరు మాత్రమూ లేదు దృశ్యుడు అంటున్నారు. bibleలో వ్రాయబడినదానికన్నా మనుష్యులు చెప్పినది నమ్ముతున్నారంటే దేవునిపై ,దేవుని వాక్యముపై మనుష్యులపై నమ్మకము ఎక్కువ.కనిపించేది ఎదన్న ఉంటె అది అందరికి కనపడుతుంది example:: sun,moon,stars అందరికి కనపడుతున్నాయి కానీ air ఎవ్వరికి కనపడదు.నాకు air కనపడింది అంటే వీడికి పిచ్చి పట్టింది అంటారు కానీ దేవుడిని చూసాను,మాట్లాడను అంటే దండము పెడుతున్నారు.ఏంటి ఈ విచిత్రము??దేవుని వలన కలగబడిన గాలి మనకు కనపడనప్పుడు airని కలగజేసిన దేవుడిని చూశానని చెప్పటము ఎంతవరకు నిజము?

4)john5:37-యేసు-మీరు ఈ కాలమందైనాను అయన స్వరము వినలేదు,అయన స్వరూపము చూడలేదు. అన్కమంది పాతనిబందనలో యాకోబు,మోషే,అబ్రహాము వాళ్ళు చూసారు,మాట్లాడారు కదా అని అంటున్నారు. అస్సలు వాళ్ళకు కనిపించింది దేవుడా లేక మరి ఎవ్వరైననా???
(a) ఆదికాండము 32:30-యాకోబు-నేను ముఖముఖిగా “దేవునిని” చుసితిని.......ఆదికాండము 32:24-ఒక “నరుడు” తెల్లవారు వరకు యకోబుతో పెనుగులడెను...ఇక్కడ యాకోబు నరుడుతో పెనుగులాడాడు.ఆదికాండ32:26-నీవూ దేవునితో,మనుషునితో పోరాడి గెలిచివి గనుక israel అను name పెట్టబడెను. పై సందర్బాలలో యకోబునకు కనపడింది నరుడు ఉన్నాడు,దేవుడు ఉన్నాడు.ఇంతకు యాకోబు నరుడినా లేక దేవున్ని చూసాడా??హోషయ 12:౩లొ అతడు దుతతో పోరాడి జయము పొందెను. ఇక్కడ యకోబుతో పోరాడింది నరుడా? దేవుడా?దుతనా?? పరతనికి దేవుడు రాడని మనకు తెలుసు. example: పరలోకములో గొప్ప యుద్దము జరిగినప్పుడు మికయేలు అను దూత ను పంపించాడే తప్ప దేవుడు చేయలేదు. ఇక్కడ యాకోబుతో పోరాడటానికి దేవుడు రావాలా? వస్తాడా? రాదు. ఇక్కడ యకోబుకు దూత కనపడింది.
(b)ఆదికాండ 18:1-అబ్రహమునకు యహోవా కనపడెను. ఇప్పుడు క్రింది వచనము చూస్తే అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనపడిరి. ఇంతకు అబ్రహమునకు కనిపించినది యెహోవ నా లేక మనుషులా?? అబ్రహాము మనుష్యులను చూసి యెహోవ అనుకున్నాడు. ఈ మనుషులు దేవుని పక్షాన,దేవుడు పంపగా,దేవుని తరపున వచ్చారు.వచ్చింది మనుషులు అయితే ప్రభువు అంటున్నారు ఏంటి?? అపోకర్య 10:4-అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా అనెను. ఇక్కడ వచ్చింది దూత కానీ సంభోదిస్తున్నది మాత్రమూ ప్రభువా అని.ప్రభువా అంటే ప్రభువు వచ్చాడని కాదు.కనుక యాకోబు విషయములో అక్కడ కనపడింది నరుడు అంటే దేవదూత. ఆ దేవదుతనే యాకోబు దేవుడుగా ,నరుడుగా అనుకున్నాడు.ముఖముకి అనగా దూత అని.అబ్రహమునకు కనపడింది మనుష్యులు అనగా దేవ దూతలు.
(c) నిర్గమ 3:2 నుంచి- యెహోవ దూత అతనికి ప్రతక్షమాయెను.నిర్గమ3:4లో దేవుడు ఆ పొద నుండి మోషే అని పిలిచెను.ఇక్కడ ఇంతకు పిలిచింది దుతనా లేక దేవుడా??నిర్గమ 3:2లో దూత అని ఉంది. అక్కడ అపోకార్య లో కోర్నేలి విషయములో దేవుని దూత ను ప్రభువా అన్నాడు. ప్రభువు మాటలను తీసుకోని వచ్చారు గనుక,ప్రభువు చెప్పమన్నది చెప్పుతున్నారు గనుక ప్రభువా అని సంబోదించారు.

5) పాతనిబందనలో జరిగిన ప్రతి సందర్భములో దేవదూతలు దేవుని పక్షాన,దేవుని తరపున వచ్చి మాట్లడారే తప్ప దేవుడు కాదు.దేవదూతలు ఉండగా దేవుడు దిగి వచ్చి మాట్లాడవలసిన అవసరత ఏమి ఉంది??కీర్తనలు 50:3లో అయన ముందర అగ్ని మండుచున్నది,అయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. కీర్తనలు 46:6లో అయన తన కంట ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. అంటే అయన చూడడానికి మన నేత్రాలు పని చేయవు,అయన మాట వినడానికి మన చెవులు వినబడవు. నిర్గమ 33:20- దేవుడు-నీవూ నా ముఖమును చూడజాలవు;ఈ నరుడు నన్ను చూసి బ్రతుకడు. ఇక్కడ దువుని చూస్తే వాడు బ్రతకడు అని ఉంటె మరి మేము దేవునిని చూసాము అని చెప్తున్నవారు ఎలా బ్రతికారు?

6)అపోకర్య7:38లో సినాయి పర్వతము మీద తనతో(మోషే) మాటలాడిన దూత అని ఉంది. గలతీ 3:19-ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దూత ద్వార నియమింపబడేను..... హెబ్రీ 2:22-దేవదుతల ద్వార పలకబడిన వాక్యము......1తిమోతి6:16- మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు,ఎవడును చుడనేరాడు.. paul చుడనేరాడు అని భవిష్యత్తు చెప్తే మేము దేవునిని చూసామని ఎలా చెప్తారు???1john 4:12-ఏ మనవుడును దేవుని ఎప్పుడు చూచియుండలేదు .

7)దేవుడు మనకు కనపడవలసిన అవసరత లేదు. అయన మాటలన్నీ 66పుస్తకలగా మన చేతికి ఇచ్చాడు. john 1:18- ఎవడును,ఎప్పుడైనను దేవునిని చూడలేదు. అంటే ఆదాము మొదలకుని యేసు వరకు,యేసు నుంచి paul వరకు, paul నుంచి ఇప్పటివరకు ఎవ్వరు దేవుని చూడలేరు చుడనేరరు .

8) ఒకవేళ యేసు మాకు కనపడ్డాడు అంటే 1 కోరంది 15:8-అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అంటే paul కి చివరిగా యేసు కనపడెను అని చెప్పుచున్నాడు.paulకి యేసు కనిపించడమే చివరి సారి. యోబు 19:25,26,27- శరీరము లేనివాడనై దేవునిని చూచెదను. అంటే శరీరము ఉండగా దేవుని చూసే chance లేదు అని. దేవుని చూడదలుచుకుంటే మరణించాలి.మత్తయి 5:8-హృదయ శుద్ది గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అంటే మరణించిన తర్వాత మన హృదయము శుద్దిగా ఉంటె దేవుని చూస్తామని.

9) కనుక మనుష్యులు తండ్రి అయిన దేవునిని చూడలేరు మరితు అయన మాట వినే chance లేదు



Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget